ఆకాశం అంతా నీలంగా వుంది...
భూమి అంత వేడి నిట్టూర్పులతో వేడెక్కి వుంది ...
పక్షులు తల దాచుకోవడానికి చిగురుటాకుల నీడ లేక
మోడు బారిన కొమ్మలలో గూళ్ళు కట్టు కున్నాయి ..
జీవులన్నీ వేడి తాపం తీర్చుకోడానికి
కన్నీటినే పన్నిటిగా మల్చుకోలేక అవస్థ పడుతున్నాయి...
అంతా కరువు ...
నిలువ నీడ లేక
తాగ నీటి చుక్క లేక
మింగ మెతుకు లేక
సకల జీవ రాశి అవస్థ పడుతోంది...
అలాంటి సమయంలో
చల్లని చిరుగాలి నల్లటి మేగాన్ని వచ్చి అడిగింది...
"మేఘమా మేఘమా... ఎందుకు నీవు వర్షించటం లేదు?
చూడు! నీ రాకకై సకల జీవరాశి ఎలా ఎదురు చూస్తోందో...
నేవు లేక వాటి దుస్థితి చూడు ఎంత వేదనగా వుందో...
ఒకసారి వర్షించి వాటికి జీవాన్ని ఇవ్వవూ?..."
మేఘం: "ఓ చిరుగాలి!
నీ స్పర్శ నాకు దూరమైనంత వరకు
నేను ఎంత పెద్ద మేఘాన్నయినా
ఒక మంచు తెరగా వుండే వ్యర్ధాన్నే...
నువ్వు నాకు దూరమైవుంటే
నేను జీవమున్న నిర్జివాన్నే..
నీవు నన్ను స్పర్శించినపుడే..
నేను పులకరించి వర్షిస్తాను....
అపుడే కదా ఈ జీవరాశి నన్ను హర్షించేది..
నన్ను వీడి నివు ఉండలేవు...
నిన్ను వీడి నేను ఉండ లేను...
మనం ఇరువురం లేనిదే ఈ సృష్టి ఉండదు..
ఒకరికి ఒకరం ఆత్మల్ల పెన వేసుకున్నాం...
అంటున్న మేఘాన్ని పెన వేసుకున్న చిరుగాలి కౌగిలి లో
పరవశించి పోయిన మేఘం ప్రేమ అనే నీటి బిందువులతో
సకల జీవరాశికి జీవాన్ని నింపింది...
ఓ నా 'సుంధర' మేఘమా... నే చిరుగాలినై నీ ప్రేమ స్పర్శతో
శిశిర ఝరి నై 'సుధ'లు కురిపించనా.....
మధురమైన సృష్టిని స్వాగతిన్చనా....